- మంత్రి మహేందర్రెడ్డికి జర్నలిస్టుల వినతి
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్లో పని చేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని మంత్రి మహేందర్రెడ్డికి ‘ది తెలంగాణ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. సొసైటీ తరఫున జర్నలిస్టుల బృందం శనివారం మంత్రితో పాటు సీఎస్ శాంతి కుమారిని కలిశారు.
హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించాలని కోరారు. ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని వారు హామీ ఇచ్చారన్నారు.