వరంగల్​ లో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టిన మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ

వరంగల్​ లో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టిన మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ

వరంగల్​ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు.  ఈ సందర్భంగా ఆయన మంత్రి కొండా సురేఖతో కలిసి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు.  వరంగల్ బస్ స్టాండ్ , ఏస్ ఎన్ ఎం.జంక్షన్ లో  బల్దియా స్మార్ట్  సిటీ నిధులు రూ.60 లక్షల వ్యయం తో నిర్మించిన జంక్షన్ అభివృద్ది పనులను న మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  వరంగల్ ఎంపీ కడియం కావ్య , నగర మేయర్ గుండు సుధారాణి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య,  వర్దన్న పేట ఎమ్మెల్యే కే. ఆర్ నాగరాజు జిల్లా కలెక్టర్ డా సత్య శారద,  కమీషనర్ డా అశ్విని తానాజీ వాకడే  పలువురు పాల్గొన్నారు.