కులగణనలో నమోదు చేసుకోని వారికి మరో అవకాశం: మంత్రి పొన్నం ప్రభాకర్

కులగణనలో నమోదు చేసుకోని వారికి మరో అవకాశం: మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణకు సంబంధించిన మేధావులు, బలహీన వర్గాల నాయకులు, ప్రొఫెసర్లు, వివిధ స్థాయిల్లో ఉన్న అందరి విజ్ఞప్తి మేరకు కులగణనలో నమోదు చేసుకోనివారికి మరో అవకాశం ఇచ్చామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఫిబ్రవరి 16 నుండి 28 వ తేదీ వరకు ఇప్పటి వరకు కుల సర్వే లో పాల్గొనకుండా సమాచారం ఇవ్వని వారు ఎన్రోల్ చేసుకోవాలని అన్నారు. మూడు పద్ధతుల్లో కుల సర్వే లో సమాచారం ఇవ్వడానికి అవకాశం ఇవ్వడం జరిగిందని.. తెలంగాణ సమాజంలో కుల సర్వేలో నమోదు చేసుకొని వారు సమాచారం ఇవ్వనివారు సమాచారం ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.

కుల సర్వేపై ఆనాడు విజ్ఞప్తి చేసిన వారు, విమర్శలు చేసిన వారు ఇప్పుడు మిస్ అయిన వారందరినీ మోటివేట్ చేపించి సర్వేలో భాగస్వామ్యులు అయ్యేలాగా చూడాలని తెలంగాణ మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. బాధ్యత గల ప్రతిపక్షంగా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ ఎజెండా తీసుకొని ఎవరైతే తెలంగాణ కుల సర్వేలో పాల్గొనలేదో ముందుగా మీరు ,కేటీఆర్ ,హరీష్ రావు కూడా సర్వేలో పాల్గొని పార్టీ పక్షాన బలహీన వర్గాల పక్షాన సానుకూలంగా ఉన్నామని చెప్తూ నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

Also Read :- ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట

కుల సర్వేలో పాల్గొనకుండా విమర్శలకే పరిమితం అయితే తెలంగాణ బలహీన వర్గాలు చూస్తూ ఊరుకోవని అన్నారు. ఇప్పుడు ఇస్తున్న అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. సర్వే లో భాగస్వామ్యులై తెలంగాణ జనాభా లెక్కల్లో ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.