రోడ్డెక్కిన 35 ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు

రోడ్డెక్కిన  35 ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు

తెలంగాణలో తొలిసారిగా కాలుష్యరహిత ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు  అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు 35 ఎలక్ట్రిక్ బస్సులను  సెప్టెంబర్ 29న  కరీంనగర్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ప్రారంభించారు. 

అత్యాధునిక హంగులతో వాడకంలోకి వస్తోన్న ఈ 35 బస్సుల్లో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కల్గించే సదుపాయాలు ఉన్నాయి.  41 సీటింగ్ సామర్థ్యం ఉన్న ఈ  ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌కు  ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీట‌ర్లు  ప్రయాణిస్తాయి. 2-3 గంట‌ల్లో వంద శాతం పూర్తి ఛార్జింగ్ కావడమే గాకుండా క్యాబిన్ , సెలూన్‌లో రెండు చోట్ల సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేశారు.