
కోహెడ,(హుస్నాబాద్) వెలుగు: నేరస్తుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించి బాధితులకు న్యాయం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. మంగళవారం హుస్నాబాద్లో కొత్తగా నిర్మించిన ఏసీపీ ఆఫీస్ను ఐజీ రమేశ్రెడ్డి, కలెక్టర్మనుచౌదరి, సీపీ అనురాధతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రెండ్లీ పోలీసింగ్నేరస్తులకు వర్తించదన్నారు.
బాధితులు ఏ సమస్య ఉన్నా నేరుగా పోలీసులకు చెప్పుకొని న్యాయం పొందే విధంగా పోలీసులు వ్యవహరించాలన్నారు. అంతకు ముందు అక్కన్నపేటలో నిర్వహించిన నేత్ర వైద్య శిబిరాన్ని సందర్శించారు. కంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం బస్వాపూర్ లోని ప్రభుత్వ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు.
స్టూడెంట్స్కష్టపడి చదువుకుంటే ఉజ్వల భవిష్యత్ఉంటుందన్నారు. ప్రైవేట్స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు .గ్రామంలోకి ప్రైవేట్ స్కూల్బస్సులు రాకుండా పిల్లలందరినీ ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్పించేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీవో రామూర్తి, ఏసీపీ సతీశ్, సింగిల్విండో చైర్మన్ శివ్వయ్య, డీఈవో శ్రీనివాస్రెడ్డి, డీఎంహెచ్వో పల్వాన్, డీపీవో దేవకి దేవి పాల్గొన్నారు.