రాహుల్ గాంధీపై బీజేపీ కుట్ర చేస్తుంది : మంత్రి సీతక్క

రాహుల్ గాంధీపై బీజేపీ కుట్ర చేస్తుంది : మంత్రి సీతక్క

మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటిస్తున్నారు. కొత్తగూడ, గంగారం మండలాల్లో స్థానిక ప్రజాప్రతినిథులు, అధికారులతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు.  ఏజన్సీ ప్రాంతం కావడంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ.. బీఆర్​ఎస్​ పార్టీలు రెండూ ఒక్కటే అన్నారు.  బీజేపీ రాహుల్​ గాంధీని... బీఆర్​ఎస్​ కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని టార్గెట్​ చేశామయన్నారు. గంగారం, కొత్తగూడ మండలంలో నిరుపేదలు అందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రకటించారు.

హర్యానా లో బీజేపీ ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీ నీ చంపుతామని బెదిరిస్తూ  ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని.. వెంటనే వారిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.  దేశ స్వాతంత్య్ర కోసం  ప్రాణాలు  త్యాగం చేసిన ఇందిరా గాంధీ కుంటుంబం పై బీజేపీ కుట్ర చేస్తుందంటూ.. వెంటనే ప్రధాని మోదీ రాహుల్​ గాంధీకి క్షమాపణలు చెప్పాలన్నారు.  

 కాంగ్రెస్​ పార్టీపై బీజేపీ కుట్రలును తిప్పికొడతామని..  రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణను బీఆర్ఎస్ అడ్డుకోవాలని చూసిందన్నారు. బీఆర్​ఎస్ ఎమ్మెల్యేల భాష దారుణంగా ఉందని .. హుజూరాబాద్​ ప్రజలను బ్లాక్​ మెయిల్​ చేసి గెలిచిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే రోడ్డు ఎక్కాడని విమర్శించారు.  బీజేపీ.. బీఆర్​ఎస్ ఎమ్మెల్యేల  భాష.. వారి ప్రవర్తనను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు.