ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య: మంత్రి సీతక్క

ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య: మంత్రి సీతక్క

హైదరాబాద్:  ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలు చర్యలు తీసుకుంటుందని మంత్రి సీతక్క అన్నారు.  ఇవాళ ప్రజాభవన్​లో విద్యా కమిషన్​చైర్మన్​గా నియమితులైన ఆకునూరి మురళీ మంత్రిని కలిశారు. 

ఈ సందర్భంగా ఆమె పూల బొకే అందించి, ఘనంగా సన్మానించారు. సీఎం రేవంత్​ రెడ్డి  విద్య విధానంలో సమూల మార్పులు తీసుకువస్తున్నారని తెలిపారు.  రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచేం దుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి సీతక్క చర్చించారు.