కాంగ్రెస్ వచ్చాక తెలంగాణలో కొలువుల జాతర: మంత్రి సీతక్క

కాంగ్రెస్ వచ్చాక తెలంగాణలో కొలువుల జాతర: మంత్రి సీతక్క

హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొలువుల జాతరను స్టార్ట్​చేసిందని మంత్రి సీతక్క తెలిపారు. ఇవాళ బంజారాహిల్స్‎లోని  పంచాయతీ రాజ్​ఆఫీస్‏లో ఇటీవల నియమాక పత్రాలు అందుకున్న ఏఈఈల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డ్యూటీని నిబద్ధత, అంకితభావంతో పనిచేసి, ప్రజలకు సేవ చేయాలన్నారు.  ‘బీఆర్ఎస్​పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను పట్టించుకోలేదు. ఉద్యోగాలు ఇవ్వక నిరుద్యోగులను ఇబ్బందులు పెట్టింది.  ఏళ్లకొద్ది నిరుద్యోగుల కష్టాలను కాంగ్రెస్ వచ్చిన తర్వాత దూరం చేసింది. 

సీఎం రేవంత్​ రెడ్డి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి, పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. మేనిఫెస్టోలో ఇచ్చిన్నట్లు జాబ్​క్యాలెండర్​ప్రకటించారు. అధికారులుగా ప్రజాప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలి.  కష్టపడి పనిచేయాలి. మీ కుటుంబానికి, ప్రభుత్వానికి మంచి పేరును తీసుకురావాలి. పనితనంతోనే గుర్తింపు వస్తుంది. శాశ్వతంగా నిలిచిపోయేలా మీ పనులు ఉండాలి. నాణ్యతపై ఎక్కడ రాజీ పడొద్దు’ అని మంత్రి సీతక్క అన్నారు.