కోల్డ్​ చైయిన్​పై సదస్సు .. హాజరైన మంత్రి శ్రీధర్​బాబు

కోల్డ్​ చైయిన్​పై సదస్సు .. హాజరైన మంత్రి శ్రీధర్​బాబు

హైదరాబాద్​, వెలుగు: కోల్డ్​ చెయిన్​ పరిశ్రమ వృద్ధి, అవకాశాలు, పెట్టుబడులపై చర్చించడానికి ‘కోల్డ్​చెయిన్​ అన్​బ్రోకెన్​2024’ పేరుతో హైదరాబాద్​లో గురువారం సదస్సు జరిగింది.   ఇరవైకి పైగా దేశాల నుంచి 350 మందికిపైగా పరిశ్రమ నిపుణులు, విధానకర్తలు, వాటాదారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోల్డ్​చెయిన్​కు సంబంధించిన కొత్త టెక్నాలజీలను ప్రదర్శించారని సీసీయూబీ చైర్మన్​ సతీష్​లక్కరాజు చెప్పారు. 

మన రాష్ట్రంలో కోల్డ్​చెయిన్​స్టోరేజీకి ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా వచ్చిన రాష్ట్ర పరిశ్రమలు,  ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, మాట్లాడుతూ, లాజిస్టిక్స్​లో పర్యావరణ అనుకూల పరిష్కారాలను కనుగొనడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్​ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు.