తెలంగాణకు నిధులు కేటాయించే విషయంలో అన్యాయం చేసిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనేకసార్లు ఢిల్లీ వెళ్లిన ప్రతి సందర్భంలో ప్రధానిని.. కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణకు సాయం చేయాలని కోరినా ... బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు .. తెలంగాణపై రాజకీయ కక్ష ధోరణిని కేంద్రం కొనసాగించిందన్నారు. విద్యా పరంగా కాని.. ఎయిర్ పోర్టుల విషయంలో కాని.. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్లకు నిధులను ఎందుకు కేటాయించలేదని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
తెలంగాణలో మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతో ఉందని... ట్రాఫిక్ సంబంధించి అనేక సమస్యలున్నాయని.. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ను నిర్మించేందుకు కేంద్రం సహకారం కావాలని కోరినా పట్టించుకోలేదన్నారు. విద్యా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ట్రిపుల్ ఐటీ,ఐఐటి, సైనిక్ కళాశాలలను తెలంగాణలో ఏర్పాటు చేసే విషయంలో కేంద్రం పునరాలోచించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు.