
- వ్యవసాయాన్ని మరింత లాభసాటి చేస్తం
- అసెంబ్లీ ప్రాంగణంలో జర్మనీ ప్రతినిధులతో భేటీ
హైదరాబాద్, వెలుగు: పంటల సాగును ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీతో అనుసంధానం చేసి.. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. రాష్ట్రంలో 55 నుంచి 60 శాతం మంది వ్యవసాయం, వ్యవసాయాధారిత పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. సాగులో రైతన్నలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు టెక్నాలజీ పరిష్కారం చూపిస్తుందన్నారు. ఆ దిశగా రైతులకు మేలు జరిగేలా మరిన్ని నూతన ఆవిష్కరణలు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో జర్మనీ ఫుడ్ అండ్అగ్రికల్చర్ ఫెడరల్మినిస్ట్రీ ఏషియా హెడ్రెబెక్కా రిడ్డర్ఆధ్వర్యంలోని ప్రతినిధులతో మంత్రి శ్రీధర్బాబు సమావేశమయ్యారు.
అన్ని రంగాల పరిశ్రమలను టెక్నాలజీస్తో అనుసంధానించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. విదేశాల్లోలాగా మన దగ్గర కూడా మనుషుల అవసరం లేకుండా ‘అగ్రి రోబో’లు వ్యవసాయం చేసే రోజులు త్వరలోనే వస్తాయన్నారు. వీటి తయారీకి ఇప్పటికే పరిశోధనలు మొదలయ్యాయని వెల్లడించారు. సాగు వ్యయం తగ్గేలా, రైతులకు మేలు చేసే కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే సంస్థలు, వ్యక్తులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామన్నారు. వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగంపై జర్మనీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తామన్నారు. కార్యక్రమంలో డా.సెబాస్టిన్ బోస్, మార్టిన్, స్వెన్, డా.రఘు చాలిగంటి, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ జానయ్య
తదితరులు పాల్గొన్నారు.