బీటెక్​ గ్రాడ్యుయేట్లకు బీఎఫ్ఎస్ఐలో ప్రత్యేక శిక్షణ : మంత్రి శ్రీధర్​బాబు

బీటెక్​ గ్రాడ్యుయేట్లకు బీఎఫ్ఎస్ఐలో ప్రత్యేక శిక్షణ : మంత్రి శ్రీధర్​బాబు
  • స్కిల్​ వర్సిటీలో 4 నెలల కోర్సు అందిస్తాం

హైదరాబాద్, వెలుగు: బీటెక్​ గ్రాడ్యుయేట్లకు బీఎఫ్ఎస్ఐ రంగంలో నాలుగు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​ బాబు తెలిపారు. బీఎఫ్ఎస్​ఐ స్కిల్లింగ్​ పేరిట యంగ్​ ఇండియా స్కిల్స్​ యూనివర్సిటీలో ఈ కోర్సును అందిస్తామని శనివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. బీఎఫ్ఎస్ఐ క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్సార్టియం, ఎక్విప్​ స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హకారంతో స్కిల్​ యూనివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్సిటీ ద్వారా యువతకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇస్తామని చెప్పారు. బ్యాంకింగ్, ఆప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్స్, ఫైనాన్షియ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్​ మార్కెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్​మెంట్​ బ్యాంకింగ్, సాఫ్ట్​వేర్  ప్రోగ్రామింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అప్లికేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్  అండ్  డేటాబేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సైబ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్  సెక్యూరిటీ, క్లౌడ్  కంప్యూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సాఫ్ట్ స్కిల్స్  త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దిత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర అంశాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై శిక్షణ ఇస్తామని వెల్లడించారు.

 శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చేలా సహకరిస్తామని చెప్పారు. ఈ కోర్సు కోసం ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని, కేవలం సర్టిఫికెట్, ఇతర అడ్మినిస్ట్రేషన్​ అవసరాలకు రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ కోర్సుకు ప్రత్యేక పరీక్ష నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామన్నారు. ఈ ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫా కోర్సుకు 1320 మంది బీటెక్​ గ్రాడ్యుయేట్లు రిజిస్టర్​ చేసుకున్నారని తెలిపారు. వీరంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రికి ఆదివారం గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చిబౌలిలోని ఇంజినీరింగ్​ స్టాఫ్​ కాలేజీ ఆఫ్ ఇండియా (ఈఎస్ఐసీ) ప్రాంగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణంలో టెస్టు పెడతామన్నారు. 

ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిశ్రమల అవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామన్నారు. గ్లోబల్​ కేపబిలిటీ సెంటర్లలలో (జీసీసీ) యువతకు ఉపాధి అవకాశాలు వచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నదని పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్​లో 355 జీసీసీలు ఉండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా.. 3 లక్షల మంది ఉద్యోగులు ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నిచేస్తున్నార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని తెలిపారు.