మంత్రి కాన్వాయ్ ​ఢీకొని ముగ్గురికి గాయాలు

మంత్రి కాన్వాయ్ ​ఢీకొని ముగ్గురికి గాయాలు

సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం సమీపంలో బుధవారం రాత్రి మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ ఢీకొని ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. మర్కూక్ మండలం పాతూరు గ్రామానికి చెందిన చందా కనకయ్య, మన్నే బాలరాజు

అతడి కొడుకు భాను ప్రసాద్​ (8) తో కలిసి బైక్​పై రోడ్డు దాటుతుండగా గజ్వేల్ వైపు నుంచి హైదరాబాద్​ వైపు వెళ్తున్న మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరికి గాయాలు కాగా బాలుడి  రెండు కాళ్లు విరిగాయి. పోలీసులు అతడిని కిమ్స్​ ఆస్పత్రికి తరలించారు.