వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ : కొండా సురేఖ

వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ : కొండా సురేఖ

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి  ఆదేశాల మేరకు వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు మంత్రి సురేఖ ఒక ప్రకటనలో తెలిపారు.  ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వాహకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.  ప్రకృతిహితాన్ని కోరే వినాయక చవితి పండుగను పర్యావరణహిత గణపతుల ప్రతిమలను ప్రతిష్టించి పండుగకు సార్థకతను చేకూర్చాలని కోరారు.

 విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర ప్రగతికి చేపట్టే కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి కావాలని, ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.