ప్రభుత్వం తీపికబురు అందిస్తుంది: మంత్రి తుమ్మల

ప్రభుత్వం తీపికబురు అందిస్తుంది: మంత్రి తుమ్మల

హైదరాబాద్: త్వరలోనే గ్రూప్​4 ఫైనల్​సెలెక్షన్​ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టుతున్నట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు తెలిపారు. ఇవాళ  గాంధీభవన్​లో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో గ్రూప్​4 అభ్యర్థులు మంత్రిని కలిశారు. 2022 డిసెంబర్​లో గ్రూప్​4 నోటిఫికేషన్​ వచ్చిందని, ఫైనల్​రిజల్ట్​ఇప్పటికీ ప్రకటించలేదని పలువురు అభ్యర్థులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీజీపీఎస్సీ ఛైర్మన్​ మహేందర్​రెడ్డితో ఫోన్​లో మాట్లాడారు.   ఫైనల్​రిజల్ట్​ను ప్రకటించాలన్నారు.  త్వరలోనే గ్రూప్​4 అభ్యర్థుల సమస్యను ప్రభుత్వం పరిష్కరించి, తీపి కబురు అందిస్తమని మంత్రి హామీ ఇచ్చారు.

ALSO READ | సింగరేణిపై పోకస్