అలాంటి భూములకు రైతు భరోసా ఇవ్వం: మంత్రి తుమ్మల

అలాంటి భూములకు రైతు భరోసా ఇవ్వం: మంత్రి తుమ్మల

పంటలు వేసిన భూములకే రైతు భరోసా ఇస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. రిపోర్ట్ రాగానే రైతు భరోసా ఇస్తామన్నారు. పంటలకు పనికి రాని భూములకు రైతు భరోసా ఇవ్వబోమన్నారు. రుణమాఫీపై ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోవద్దన్నారు. సన్న వడ్లకు క్వింటాల్ కు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పారు తుమ్మల. 

ALSO READ | మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి : కలెక్టర్ ​హనుమంతు జెండగే 

 దేశంలో  ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు రుణమాఫీ చేశామన్నారు మంత్రి తుమ్మల. రాహుల్  మాట ప్రకారం రైతు రుణ మాఫీ చేశామన్నారు. 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు ఉన్న  రుణాలు  మాఫీ చేస్తామన్నారు.  ఇప్పటి వరకు 18 వేల కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు తుమ్మల.  2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న అమౌంట్ కడితే..వాళ్లకు రుణ మాఫీ చేస్తామని చెప్పారు. ప్రతి రైతు బీమా ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు తుమ్మల.