పెద్దవాగు పరివాహకప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి తుమ్మల

పెద్దవాగు పరివాహకప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి తుమ్మల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని పెద్దవాగును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పరిశీలించారు. పెద్దవాగు ఆనకట్టకు పడిన గండ్లను అధికారులతో కలిసి విజిట్ చేశారు. మరమ్మతు పనులపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. పెద్దవాగు గండికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

వర్షం ప్రభావిత గ్రామాల్లో ప్రతి కుటుంబానికి నిత్యం భోజనం, ఇంటింటికి బియ్యం, కూరగాయలు, నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. ప్రతి ఇంటికి వైద్యసిబ్బందిని పంపించాలని.. డెంగ్యూ లాంటి విషజ్వరాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రతిగ్రామంలో అధికారులు పర్యటించాలని.. ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని చెప్పారు.