మలేషియాకు మంత్రి తుమ్మల

మలేషియాకు మంత్రి తుమ్మల
  • ఆయిల్ పామ్ సాగు విధానంపై అధ్యయనం
  • 3 రోజులపాటు అక్కడే

ఖమ్మం: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మలేషియా పర్య టనకు వెళ్లారు. ఆయిల్​పామ్ సాగు విధానం, నూనె గింజల ఉత్పత్తి... తదితర అంశాలపై అధ్యయనం చేయటానికి మలేషియా బయలు దేరివెళ్లారు. మూడు రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు.

 ఉద్యాన శాఖ ద్వారా రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆయిల్ పామ్ ప్రాజె క్టును మరింత విజయవంతం చేయటానికిగాను తీసుకోవాల్సిన చర్య లపై ఆయన అధ్యయనం చేయనున్నారు. మంత్రి వెంట వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉద్యానశాఖ కమిషనర్ యాస్మిన్ భాషా, అధికా రులు సరోజిని, ఓఎస్టీ శ్రీధర్ ఉన్నారు.

ALSO READ | మోదీ బాటలో నడుస్త..: మాజీ మంత్రి కేటీఆర్