సీఎం కావాలనే కోరిక నాకు లేదు

సీఎం కావాలనే కోరిక నాకు లేదు
  • నేనొకటి మాట్లాడితే మరొకటి ప్రచారం
  • ప్రస్తుత రాజకీయ జీవితంపై సంతృప్తిగా ఉన్న
  • ఎస్ఎల్​బీసీ పూర్తి చేస్తం
  • జగదీశ్​ రెడ్డి వ్యాఖ్యలు ఖండిస్తున్న
  • మీడియాతో మంత్రి ఉత్తమ్​ చిట్​ చాట్

హైదరాబాద్​: ​ముఖ్యమంత్రి కావాలనే కోరిక తనకు లేదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్​ రెడ్డి అన్నారు. ప్రస్తుతానికి తన రాజకీయ జీవితంపై సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్​ చాట్​ నిర్వహించారు. 'ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన. ప్రస్తుతం మంత్రిగా ఉన్న నాకు పదవులపై ఎలాంటి కోరికలు లేవు. నేను ఒకటి మాట్లాడితే మరొకటి ప్రచారం అవుతుందన్నారు.  

ఎస్ఎల్​ బీసీ రోబోటిక్ కోసం ఇప్పటి వరకు రూ. 4 కోట్లు విడుదల చేశామన్న ఆయన, ఇలాంటి ప్రమాదం ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా ఎస్ఎల్​బీసీని పూర్తి చేస్తామన్నారు. మాజీ మంత్రి జగదీశ్​ రెడ్డి స్పీకర్​ పట్ల చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. చైర్ కు గౌరవం ఇవ్వకుండా... స్థాయిని తగ్గించి మాట్లాడి స్పీకర్​ ను అవమానపరిచారని విమర్శించారు. స్పీకర్ ను అవమానపరిచేట్లు మాట్లాడటం తాను ఇప్పటి వరకు చూడలేదన్న మంత్రి ఉత్తమ్​, ఆయన వ్యాఖ్యలపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు కూడా ఆయన మాదిరిగా వ్యవహరించరన్నారు.