రేషన్ కార్డుల జారీ సీఎస్సీ సెంటర్లకు కేటాయించాలి : మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి

 రేషన్ కార్డుల జారీ సీఎస్సీ సెంటర్లకు కేటాయించాలి : మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి

బచ్చన్నపేట, వెలుగు: కొత్త రేషన్​కార్డుల జారీ నిర్వహణ సీఎస్సీ డిజిటల్ సెంటర్లకు కేటాయించాలని రాష్ట్ర సీఎస్సీ డిజిటల్ సెంటర్ల ప్రధాన కార్యదర్శి రాపల్లి వెంకటేశ్ పుడ్ అండ్​ సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డిని కోరారు. శనివారం రాష్ట్ర సంఘం అధ్యక్షురాలు జ్యోతితో కలిసి హైదరాబాద్​లో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు.

అనంతరం వారు మంత్రిని శాలువాతో సన్మానించారు. వారి విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. తమ రిప్రజెంటేషన్​ను మంత్రి ఎండార్స్​ చేయగా, సివిల్​ సప్లై ప్రిన్సిపల్ సెక్రెటరీ డీఎస్ చౌహాన్​కు అందజేశామన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఆ సంఘం నాయకులు నాగరాజు, వినాయ్ తదితరులున్నారు.