
నల్గొండ, వెలుగు : జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఇరిగేషన్, సివిల్సప్లై శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి విచారణకు ఆదేశించారు. హాలియా, పెద్దవూరలో అమ్మ రైస్మిల్లుకు రేషన్బియ్యం అక్రమంగా తరలించడంతో పోలీసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వెలుగు దినపత్రికలో మూడు రోజులుగా ప్రచురించిన కథనాలపై మంత్రి ఉత్తమ్స్పందించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విచారణకు ఆదేశించామని, త్వరలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే కాంట్రాక్టర్ల అగ్రిమెంట్ కూడా రద్ధు చేస్తామని హెచ్చరించారు.