రూ.2 వేల కోట్లతో ఐరా రియల్టీ ప్రాజెక్టు... ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి

రూ.2 వేల కోట్లతో ఐరా రియల్టీ ప్రాజెక్టు... ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: నగరానికి చెందిన రియల్ ఎస్టేట్​ కంపెనీ ఐరా రూ.రెండు వేల కోట్ల పెట్టుబడితో చేపట్టిన స్క్వేర్​ ప్రాజెక్టును రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.  ఆదిభట్లలోని ఔటర్ రింగ్ రోడ్, ఏరోస్పేస్ హబ్‌‌లకు సమీపంలో దీనిని నిర్మిస్తున్నారు. 

ప్రాజెక్ట్​ 13.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ 3,700 చదరపు అడుగుల విస్తీర్ణం గల 131 నాలుగు బెడ్​రూమ్​  విల్లాలు ఉంటాయి. ప్రతి విల్లాలో ఇంటి ఆటోమేషన్, ల్యాండ్‌‌స్కేప్డ్ గార్డెన్లు వంటి సదుపాయాలు ఉంటాయని ఐరా రియాల్టీ చైర్మన్ నర్సి రెడ్డి చెప్పారు.  జిమ్, సెమీ-కవర్డ్ స్విమ్మింగ్ పూల్,  బాంకెట్ హాల్​తోపాటు అనేక వినోద సౌకర్యాలను అందిస్తామని ఆయన చెప్పారు.