బాలాపూర్ గణేశునికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు

బాలాపూర్ గణేశునికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు

రంగారెడ్డి జిల్లా: ప్రఖ్యాతి చెందిన బాలాపూర్ గణపతిని ఆర్ అండ్ బీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు దర్శించుకున్నారు. వారితోపాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి గాంచిన బాలాపూర్ గణపతిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు విజ్ఞాలను తొలగించి అందరు సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవున్ని కోరుకున్నానని తెలిపారు.