
రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ గురుకుల పాఠశాలలో 5వ తరగతికి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు మైనార్టీ సంక్షేమాధికారి తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మైనార్టీ గురుకుల పాఠశాలలో నిర్వహించనున్నట్లు చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారు ఉదయం 10 గంటల వరకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్, రైటింగ్ ప్యాడ్, బ్లూ లేదా బ్లాక్ పెన్, ఆధార్ కార్డు, ఫొటో తీసుకురావాలని సూచించారు.