
జూబ్లీహిల్స్ వెలుగు : మిస్వరల్డ్– 2024 క్రిస్టినా పిజ్కోవా శుక్రవారం కేబీఆర్ పార్కులో మెరిశారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుని మంత్రి కొండా సురేఖతో కలిసి మొక్కలు నాటారు. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలంటూ పలువురు స్కూల్ స్టూడెంట్లు వేసిన పెయింటింగ్స్ను చూసి అభినందించారు.
పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ క్రిస్టినా పిజ్కోవాను సత్కరించారు.