
కూసుమంచి మండలంలో బోడియాతండా సమీపంలో సోమవారం మిషన్ భగీరథ పైపులైన్ గేట్వాల్ లీకై తాగునీరు వృథాగా పోతోంది. పాలేరు నుంచి మహబూబాబాద్ జిల్లాకు సరఫరా చేసే పైపులైన్ గేట్వాల్ లీక్ కావడంతో నీరు ఎగజిమ్ముతోంది. అధికారులు స్పందించి రిపేర్లు చేయాల్సిన అవసరం ఉంది.
- కూసుమంచి,వెలుగు