పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్.. వృథాగా పోతున్న నీరు

పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్.. వృథాగా పోతున్న నీరు

రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలో మిషన్ భగీరథ ఫైపు పగిలిపోవడంతో రోడ్డుపై నీరు వృధాగా పోతోంది. దీంతో షాద్ నగర్ పరిగి రహదారిపై ట్రాఫిక్  అంతరాయం ఏర్పడింది. రోడ్డు పక్కన ఉన్న పైప్ లైన్ ను టిప్పర్ డీ కొనడం తో పైప్ లైన్ పగిలిపోయింది. 

ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వాహనాల రాకపోకలు అనంతరం ఏర్పడకుండా చర్యలు చేపట్టి మిషన్ భగీరథ అధికారులకు సమాచారం అందించారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్షం కారణంగా పైప్ లైన్ పగిలిపోయినట్లు తెలిపారు స్థానికులు.

ALSO READ | క్వింటాకు రూ.500: రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్