
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ఎర్రమంజిల్లోని మిషన్భగీరథ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్18005994007కు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. మంత్రి సీతక్క ఆదేశాలతో గతేడాది డిసెంబర్ 23న కాల్సెంటర్ప్రారంభించారు. వాటర్రాకపోవడం, లీకేజీలు, సిబ్బంది స్పందించకపోడం తదితర సమస్యలపై జనం ఈ నంబర్కు కాల్చేస్తున్నారు. సగటున ప్రతిరోజూ10 కాల్స్వస్తున్నాయని ఆఫీసర్లు చెప్తున్నారు.
శనివారం వరకు మొత్తం 280 కాల్స్ రాగా ఇందులో పట్టణ ప్రాంతాల నుంచి 73, గ్రామీణ ప్రాంతాల నుంచి 207 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో187 ఫిర్యాదులను అధికారులు పరిష్కరించారు. వస్తున్న కాల్స్లో నీళ్లు రావడం లేదనే ఫిర్యాదులే అత్యధికంగా ఉంటున్నాయని వారు చెప్తున్నారు.