ఐడీ కార్డు అడిగిన సెక్యూరిటీతో గొడవ .. ఆరుగురు జెప్టో డెలివరీ బాయ్స్ పై కేసు

ఐడీ కార్డు అడిగిన సెక్యూరిటీతో గొడవ .. ఆరుగురు జెప్టో డెలివరీ బాయ్స్ పై కేసు
  • ఆలస్యంగా వెలుగులోకి..

మియాపూర్, వెలుగు: ఐడీ కార్డు అడిగితే చూపించకుండా సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడిన జెప్టో డెలివరీ బాయ్స్ పై  పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మియాపూర్​ పోలీస్​స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. మియాపూర్​మై హోం జ్యూవెల్​అపార్ట్​మెంట్ లో ఆదివారం రాత్రి జెప్టో ఆర్డర్​ డెలివరీ చేసేందుకు బాయ్​సాగర్​వెళ్లాడు. అతడు ఐడీ కార్డు చూపించకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ విషయమై సాగర్ వాట్సాప్​ గ్రూప్​లో మెస్సేజ్​పెట్టడంతో క్షణాల్లో పదుల సంఖ్యలో డెలివరీ బాయ్స్​అక్కడికి చేరుకొని, హంగామా చేశారు. అపార్ట్​మెంట్​వాసులు, సెక్యూరిటీతో వాగ్వాదానికి దిగారు.

 పోలీసులు వచ్చి, నిందితులు సాగర్, అశోక్, గోవిందరాజు, సాయికుమార్, నరేందర్, డెవిల్​లను అదుపులోకి తీసుకున్నారు. అపార్ట్​మెంట్​వాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.  డెలివరీ బాయ్స్ మద్యం మత్తులో వచ్చి, అసభ్యకరంగా ప్రవర్తించారని అపార్ట్​మెంట్​ప్రెసిడెంట్ మహేశ్​తెలిపారు. డెలివరీ బాయ్స్​కు ఆయా సంస్థలు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని 
కోరారు.