
వేములవాడ, వెలుగు: పదేళ్లలో బీఆర్ఎస్ప్రభుత్వం చేయని అభివృద్ధి.. పది నెలల్లో చేసి చూపామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్, మెదక్, -నిజామాబాద్-, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి వూట్కూరి నరేందర్రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో లైబ్రరీ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, మహేశ్, శ్రీనివాస్గౌడ్, కుమార్, ఎల్లయ్య పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట, వెలుగు: ముదిరాజ్లు ఆర్థికంగా ఎదగాలని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్లో గురువారం ముదిరాజ్ల ఆధ్వర్యంలో నిర్మించిన ఫంక్షన్ హాల్ను ఆయన ప్రారంభించారు. చెరువుల అభివృద్ధిలో ప్రభుత్వం ముదిరాజ్లకు ప్రాధాన్యమిస్తోందన్నారు.