ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు : ఎమ్మెల్యే బాలూనాయక్

ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు : ఎమ్మెల్యే బాలూనాయక్

దేవరకొండ, చందంపేట, కొండమల్లేపల్లి, వెలుగు : ఆయిల్​పామ్​సాగుతో అధిక లాభాలు సాధించవచ్చని ఎమ్మెల్యే బాలూనాయక్ రైతులకు సూచించారు. శుక్రవారం దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామ రైతు వేదికలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆయిల్ పామ్ ఒకసారి సాగు చేస్తే 25 ఏండ్ల వరకు దిగుబడి వస్తుందన్నారు. 

ఆయిల్​పామ్ సాగుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీ కల్పిస్తుందని తెలిపారు. సదస్సులో మున్సిపల్ చైర్మన్ నర్సింహా, మాజీ ఎంపీపీ జానీయాదవ్, పీఏసీఎస్​ చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డి, అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.