![నల్లగుట్ట ఆలయం అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే భూపతిరెడ్డి](https://static.v6velugu.com/uploads/2025/02/mla-bhupathi-reddy-promises-to-work-for-the-development-of-nallagutta-temple_pYtm1Bwb6Z.jpg)
ధర్పల్లి, వెలుగు: ధర్పల్లి పెద్దమ్మ ఆలయం, దుబ్బాకలోని నల్లగుట్ట నర్సింహస్వామి ఆలయం అభివృద్ధికి కృషి చేస్తానని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి హామీ ఇచ్చారు. ధర్పల్లి మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయం, నర్సింహస్వామి ఆలయంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజాపాలన, సంక్షేమంపై దృష్టి పెట్టిందన్నారు.
ఆరు గ్యారంటీలు అమలు చేసి ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆయన అన్నారు. ఇందిరమ్మ పాలనలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పని చేస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే పుట్టిన రోజును పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేక్లు కట్ చేసి, ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాల్రాజ్, ఐడీసీఎంఎస్ తారాచంద్ నాయక్, పుప్పాలసుభాష్, మిట్టాపల్లి గంగారెడ్డి, గాదరి మనోహర్రెడ్డి, విండో చైర్మన్లు చెలిమెల చిన్నారెడ్డి(ధర్పల్లి), రాజేందర్రెడ్డి (ఒన్నాజీపేట్), చెలిమెల శ్రీనివాస్, చెలిమెల నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.