
- రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
నిజామాబాద్, వెలుగు : రెండు రోజుల క్రితం రూరల్ సెగ్మెంట్లో కురిసిన వడగండ్లు, ఆకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి కోరారు. సోమవారం అసెంబ్లీలో ఈ అంశాన్ని ఆయన లేవనెత్తగా అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర్రావు సానుకూలంగా స్పందిస్తూ నష్టపోయిన ప్రతి ఎకరం పంటకు రూ.10 వేల పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఎర్ర జొన్న రైతులు, మంచిప్ప ప్రాజెక్టు కోసం ఉద్యమించిన టైంలో రైతులపై నమోదైన పోలీస్ కేసులను ఎత్తేయాలని కోరారు. సెగ్మెంట్లో వ్యవసాయ కాలేజీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డి విజ్ఞప్తి చేశారు.