క్రీడల్లో యువత సత్తా చాటాలి : సంజయ్‌‌కుమార్‌‌‌‌

క్రీడల్లో యువత సత్తా చాటాలి : సంజయ్‌‌కుమార్‌‌‌‌
  • ఎమ్మెల్యే సంజయ్‌‌కుమార్‌‌‌‌ 

రాయికల్, వెలుగు: క్రీడల్లో యువత సత్తా చాటాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్​ సంజయ్‌‌కుమార్​ అన్నారు. రాయికల్​ భీమేశ్వర ఆలయ జాతర ఉత్సవాలను పురస్కరించుకొని సంఘమిత్ర యూత్​ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి  క్రీడాకారుల సంక్షేమానికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. కబడ్డీ పోటీలో విజేతగా నిలిచిన జట్టుకు ప్రైజ్‌‌ అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్​ మాజీ చైర్మన్​ మోర హన్మండ్లు, సింగిల్​విండో చైర్మన్​ ఏనుగు మల్లారెడ్డి, లీడర్లు అచ్యుత్​రావు, శ్రీధర్​రెడ్డి, మోర రామ్మూర్తి, మహేశ్‌‌గౌడ్​, చంద్రతేజ, సత్యనారాయణ పాల్గొన్నారు.