బెల్లంపల్లిలో అమృత్​ 2.0 పథకానికి నిథులు కేటాయించాం: ఎమ్మెల్యే గడ్డం వినోద్​

బెల్లంపల్లిలో అమృత్​ 2.0 పథకానికి నిథులు కేటాయించాం: ఎమ్మెల్యే గడ్డం వినోద్​

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్​ పర్యటించి పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు.  అమృత్​ 2.0 పథకం ద్వారా బెల్లంపల్లిలో తాగునీటిని సరఫరా చేసేందుకు 61.50 కోట్లను కేటాయించామని తెలిపారు.  అలాగే కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో మిషన్​ భగీరథ ఓవర్ హెడ్​ వాటర్​ ట్యాంక్ దగ్గర భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజాప్రతినిథులు, కలెక్టర్​ కుమార్ దీపక్​ తదితరులు పాల్గొన్నారు.