యూరియా సరఫరాలో సర్కారు మొద్దు నిద్ర :హరీశ్ రావు

యూరియా సరఫరాలో సర్కారు మొద్దు నిద్ర :హరీశ్ రావు
  • రైతులను నట్టేట ముంచింది: హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: యూరియా కోసం రైతులు మండుటెండల్లో తంటాలు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు ఆరోపించారు. మొన్న మహబూబాబాద్​లో యూరియా కోసం పోలీసులు టోకెన్లు ఇస్తే.. ఇప్పుడు జగిత్యాలలో రైతులు పాస్ ​బుక్కులు, ఆధార్​ కార్డులను క్యూలో పెట్టాల్సిన పరిస్థితి దాపురించిందని సోమవారం ‘ఎక్స్’​లో పోస్ట్​ పెట్టారు.

ఉమ్మడి రాష్ట్రంలో రైతులు పడిన కన్నీళ్ల కడగండ్లను.. ఇప్పుడు తెలంగాణలోనూ కాంగ్రెస్​ సర్కారు పునరావృతం చేస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్​ పాలనలో రైతే రాజుగా ఉన్న తెలంగాణలో.. రేవంత్​ సర్కారు నట్టేట ముంచి నడిరోడ్డుపైకి తెచ్చిందన్నారు. యూరియా సరఫరాలో సర్కారు విఫలమైందని ఫైర్ అయ్యారు.