
రామచంద్రాపురం, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు అన్యాయం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శనివారం తెల్లాపూర్మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ సీనియర్ నేతసోమిరెడ్డి, బీఆర్ఎస్ నేతలు, కౌన్సిలర్లు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో హరీశ్రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 20 ఏండ్లుగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తుండడాన్ని అభినందించారు.
మైనార్టీల సంక్షేమానికి ఎన్నికల్లో రూ.4000 కోట్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్పెద్దలు బడ్జెట్లో రూ.3000 కోట్లు పెట్టారని అందులో రూ.1000 కోట్లు కూడా ఖర్చుపెట్టలేదని విమర్శించారు. ఖర్చు చేసిన కొద్ది పాటి రూపాయలు కూడా కేసీఆర్ ఏర్పాటు చేసిన మైనార్టీ గురుకులాల కోసం మాత్రమే ఇచ్చారన్నారు. మైనార్టీ యువకులు, మహిళల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదన్నారు.
ఇప్పటి వరకు షాదీ ముబారక్, తులం బంగారం మాటే లేదన్నారు. కేబినెట్లో ఒక మైనార్టీ మినిస్టర్ కు అవకాశం ఇవ్వలేదని, ఇటీవల ఎమ్మెల్సీలలో కూడా ముస్లింలకు చోటివ్వలేదన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి కేసీఆర్ రూ.75 కోట్లను ప్రకటిస్తే కాంగ్రెస్ అందులో రూ.50 కోట్లను రద్దు చేసిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ చైర్పర్సన్ లలిత, నాయకులు ఆదర్శ్రెడ్డి, మెట్టు కుమార్, సంతోష్ రెడ్డి, గోవర్ధన్రెడ్డి పాల్గొన్నారు.