![రాజకీయాల్లో విలువలు పెంపొందించాలి : రామచంద్రనాయక్](https://static.v6velugu.com/uploads/2024/07/mla-jatoth-ramachandra-naik-attended-the-farewell-meeting-of-kuravi-mpdo-office_tpVDfjiWnx.jpg)
కురవి, వెలుగు : రాజకీయాల్లో విలువలు పెంపొందించాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రనాయక్ అన్నారు. మంగళవారం కురవి ఎంపీడీవో కార్యాలయంలో కురవి ఎంపీపీ గుగులోతు పద్మ రవినాయక్, ఎంపీటీసీల ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
కురవి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్, హరిత టూరిజన్ని తీసుకొస్తానన్నారు. అనంతరం ఎంపీపీ, ఎంపీటీసీలకు శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కురవి జడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి, ఎంపీడీవో వీరబాబు, తహసీల్దార్ సునీల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.