వేలేరు రైతు వేదికలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

వేలేరు రైతు వేదికలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్​ ఎంపీడీవో కార్యాలయం, వేలేరు రైతు వేదికలో స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. శనివారం ధర్మసాగర్ లో  102 మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్​ఎఫ్​ లబ్ధిదారులకు రూ.42,82,624 విలువైన చెక్కు అందజేశారు.

వేలేరులో మొత్తం 36 మంది లబ్ధిదారులకు రూ.18,10,660 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాదుల మూడవ దశ అతి త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు.  అనంతరం ఆయా మండలాల్లో నిర్వహించిన ఇఫ్తార్​ విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు.