కేఎల్ఐ కాల్వల రిపేర్లను పూర్తి చేయాలి : కూచుకుళ్ల రాజేశ్​రెడ్డి 

కేఎల్ఐ కాల్వల రిపేర్లను పూర్తి చేయాలి :  కూచుకుళ్ల రాజేశ్​రెడ్డి 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : కేఎల్ఐ కాల్వల రిపేర్లను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్​రెడ్డి అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మంగళవారం నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి శివారులో మహాత్మ గాంధీ ఎత్తిపోతల పథకం డి7డి, 8డి, డి9 కాల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తోందన్నారు. సాగునీటి సమస్య రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం గ్రామంలోని పీహెచ్​సీని సందర్శించి భవన నిర్మాణాన్నికి స్థలాన్ని పరిశీలించారు. 

అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం 

నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే రాజేశ్​రెడ్డి తెలిపారు. మంగళవారం నాగర్ కర్నూల్ బస్టాండ్ లో తూడుకుర్తి మీదుగా వనపర్తి వెళ్లే ఆర్టీసీ పల్లె వెలుగు బస్సును ఆయన ప్రారంభించారు. తుడుకుర్తి వరకు బస్సును నడిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కొన్ని గ్రామాలకు బస్సులు నిలుపుదల చేశారని, ఆయా గ్రామాలకు పునరుద్ధరణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం లక్ష్మీధర్మ, ఆర్టీసీ డీఎం దేవరాజ్, కాంగ్రెస్ నేతలు కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, కౌన్సిలర్ నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.