ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన  విద్యనందించాలి :  ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

 ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన  విద్యనందించాలి :  ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

పాల్వంచ రూరల్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్ జితేష్​పాటిల్ ఉపాధ్యాయులకు సూచించారు. సోమవారం మండల పరిధిలోని జగన్నాథపురం ఉన్నత పాఠశాలలో టీఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్ తాండ్ర వెంకటేశ్వరరావు అందించిన కంప్యూటర్లను ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్​ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫై టీచర్స్​ ఉంటారని, వారి ద్వారా విద్యార్థులు మంచిగా చదువుకొని విద్యను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాఠశాలకు ప్రహరీతోపాటు విద్యార్థులకు కావల్సిన క్రీడా సామగ్రి, ఇతర బోధన ఉపకరణాలను అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఈవో వెంకటేశ్వరచారి, తహసీల్దార్ వివేక్, ఎంపీడీవో విజయభాస్కర్​రెడ్డి, ట్రస్ట్ సభ్యులు నడిపల్లి నవీన్, సీపీఐ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.