ముర్రెడుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్​ నిర్మాణం : కూనంనేని సాంబశివరావు

ముర్రెడుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్​ నిర్మాణం : కూనంనేని సాంబశివరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలోని ముర్రెడు వాగుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్​ నిర్మించడంతోనే సమస్య పరిష్కారమవుతుందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీనగర్​ కాలనీ, ఎదురుగడ్డ, గౌండ్ల రామవరం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. శ్రీనగర్​గ్రామపంచాయతీ ఆఫీస్​ను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముర్రెడు వాగు ఉధృతితో కొత్తగూడెం పట్టణంతో పాటు లక్ష్మీదేవిపల్లి మండలంలోని పలు ఇండ్లు ముంపునకు గురవుతున్నాయన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రోగ్రాంలో తహసీల్దార్​ కేవీ ప్రసాద్, ఎంపీడీవో చలపతి రావు, పీఆర్​డీఈ రామకృష్ణ, ఎంపీవో శ్రీనివాస్, ఏఈ వివలాల్, వెంకటస్వామి, పలు పార్టీల నేతలు పాల్గొన్నారు.