కొత్తగూడెంలో రూ.450కోట్లతో ఓఆర్ఆర్ : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

కొత్తగూడెంలో రూ.450కోట్లతో ఓఆర్ఆర్ : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణానికి ఔటర్ రింగ్​రోడ్​ మంజూరైందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. పట్టణంలోని శేషగిరి భవన్​లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.450కోట్లతో 25కిలోమీటర్ల మేర ఔటర్​రింగ్​రోడ్​నిర్మాణం జరుగనున్నదని తెలిపారు. ఇల్లెందు–కొత్తగూడెం హైవే రహదారిలోని అనిశెట్టిపల్లి నుంచి హేమచంద్రాపురం

సర్వారం, చిట్టిరామవరం, జగన్నాథపురం వరకు పాల్వంచ–భద్రాచలం హైవే వరకు ఔటర్​ రింగ్​ రోడ్​ ప్లాన్​ ఉంటుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ. 72.86కోట్ల పనులు శాంక్షన్​అయినట్లు తెలిపారు. లెక్టరేట్​ ఎదుట హైవేపై, కొత్తగూడెం పట్టణంలోనూ మూడు ఫుట్​ఓవర్​ బ్రిడ్జీల పనులు త్వరలో ప్రారంభించనున్నామని తెలిపారు. కొత్తగూడెం–పాల్వంచ మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్​ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.