ప్రతి పల్లెకూ రోడ్డు సౌకర్యం కల్పిస్తాం : కూనంనేని సాంబశివరావు 

ప్రతి పల్లెకూ రోడ్డు సౌకర్యం కల్పిస్తాం : కూనంనేని సాంబశివరావు 

 భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : నియోజకవర్గంలోని ప్రతి పల్లెకూ రోడ్డు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నానని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శుక్రవారం శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎంతో పాటు మంత్రులను కలుస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి పనులను త్వరగా, నాణ్యతతో చేపట్టాలని ఆఫీసర్లు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. 

పాల్వంచ : పట్టణంలోని అభ్యు దయ పాఠశాలలో అదనపు తరగతి గదులు, కరక వాగులో రహదారి నిర్మాణాన్ని ఎమ్మెల్యే కూనంనేని ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయంలో 86 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధులు పట్ల అందరూ అలర్ట్​గా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ అజ్మీర స్వామి, తహసీల్దార్ వివేక్, అధికారులు, సీపీఐ, కాంగ్రెస్ పార్టీల నాయకులు పాల్గొన్నారు.