భద్రాద్రికొత్తగూడెంలో షాపింగ్​మాల్స్​ రాకతో అభివృద్ధి : కూనంనేని సాంబశివరావు

భద్రాద్రికొత్తగూడెంలో షాపింగ్​మాల్స్​ రాకతో అభివృద్ధి : కూనంనేని సాంబశివరావు
  • సౌత్​ఇండియా షాపింగ్​ మాల్​ను ప్రారంభించిన ఎమ్మెల్యే
  • సినీ హీరోయిన్స్​ పాయల్​ రాజ్ పుత్, నేహాశెట్టి సందడి 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రికొత్తగూడెంకు షాపింగ్​ మాల్స్​ రావడం అభివృద్ధికి దోహదం చేస్తోందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని చుంచుపల్లి మండలం విద్యానగర్​ కాలనీలో ఏర్పాటు చేసిన సౌత్​ ఇండియా షాపింగ్​మాల్​ను ఎమ్మెల్యేతో పాటు సినీ హీరోయిన్లు​ పాయల్​ రాజ్​పుత్, నేహశెట్టి ఆదివారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సౌత్​ఇండియా షాపింగ్​ మాల్​ రాకతో దాదాపు రెండు, మూడు వందల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. సినీ హీరోయిన్స్​ పాయల్​ రాజ్ పుత్, నేహాశెట్టి సందడి చేశారు. పలు రకాల వస్త్రాలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విభిన్న రకాలతో సౌత్​ ఇండియా షాపింగ్​మాల్​ కొత్తగూడెం ప్రజల వద్దకు వచ్చిందన్నారు.

 సౌత్​ ఇండియా షాపింగ్​ మాల్​ సంస్థ డైరెక్టర్లు సురేశ్​ శీర్ణ, అభినయ్, రాకేశ్, కేశవ్​ మాట్లాడుతూ  అనుకూలమైన ధరలలో, సరికొత్త డిజైన్లను, నాణ్యమైన బట్టలను కస్టమర్లు సొంతం చేసుకోవచ్చన్నారు. దసరా, దీపావళి సందర్భంగా అన్ని రకాల వెరైటీలపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నామని చెప్పారు. ఈ ప్రోగ్రాంలో జడ్పీ మాజీ చైర్మన్​ కంచర్ల చంద్రశేఖర్, మున్సిపల్ చైర్​ పర్సన్​ కే. సీతాలక్ష్మి, నాయకులు సాబీర్​ పాషా ఉన్నారు.