దుబ్బాకలో యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​ స్కూల్​ : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌‌‌‌రెడ్డి

దుబ్బాకలో యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​ స్కూల్​ : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌‌‌‌రెడ్డి

దుబ్బాక, వెలుగు: నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన యంగ్​ఇండియా ఇంటిగ్రేటెడ్​ స్కూల్​ను దుబ్బాకలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌‌‌‌రెడ్డి కోరారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని ఆయన నివాసంలో సీఎం రేవంత్‌‌రెడ్డిని ఎమ్మెల్యే కలిశారు. దుబ్బాకలో యంగ్​ ఇండియా, దుబ్బాక మండలం హబ్షీపూర్​నుంచి పట్టణ పరిధిలోని లచ్చపేట వార్డుకు నాలుగు లేన్ల రోడ్డుకు నిధులను మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యంగ్​ఇండియా స్కూల్​కు తగినంత స్థలాన్ని అందజేస్తామని చెప్పడంతో సానుకూలంగా స్పందించిన సీఎం.. దుబ్బాకలో స్థల పరిశీలన చేయాలని సీఎంవో అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. దుబ్బాక మండలం హబ్షీపూర్​నుంచి మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట వార్డు వరకు నాలుగు లేన్ల రోడ్డుకు మోక్షం లభించనున్నదని, రోడ్డు అభివృద్ధి కోసం రూ.35 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. అడిగిన వెంటనే స్పందించిన సీఎంకు నియోజకవర్గ ప్రజల పక్షాన ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.