భువనగిరి పోర్ట్​కు రోప్ వే, ఫోర్ వే రోడ్ ఏర్పాటు చేస్తాం : ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్ రెడ్డి

భువనగిరి పోర్ట్​కు రోప్ వే, ఫోర్ వే రోడ్ ఏర్పాటు చేస్తాం : ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్ రెడ్డి

యాదాద్రి, వెలుగు : భువనగిరి పోర్ట్​కు రోప్​ వేను త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్ రెడ్డి తెలిపారు. గుట్ట చుట్టూ హైవేను కలుపుతూ ఫోర్​వే రోడ్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రోప్ వే ఏర్పాటు చేసే పాయింట్​ను ఆయన బుధవారం పరిశీలించి మాట్లాడారు. రోప్​ వే, సౌండ్ అండ్​​ లైట్​ఏర్పాటుతో టూరిజం సెంటర్​గా భువనగిరి మారుతుందని తెలిపారు.

ఇందుకోసం రూ.55 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. జిల్లాలో యాదగిరి గుట్ట దేవస్థానం, బస్వాపురం రిజర్వాయర్​సహా ఇతర కట్టడాల కారణంగా టూరిజం డెవలప్ అవుతుందన్నారు. తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ముత్తిరెడ్డిగూడెం వద్ద స్పోర్ట్​స్టేడియం ఏర్పాటు కోసం రూ.33 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. వలిగొండ, బీబీనగర్​, భూదాన్​ పోచంపల్లిలోనూ స్పోర్ట్ స్టేడియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట కలెక్టర్ హనుమంతు జెండగే, టూరిజం జీఎం ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, కమిషనర్​రామాంజులరెడ్డి, తహసీల్దార్ శ్రీకాంత్​రెడ్డి ఉన్నారు.