రైతులు దళారులను నమ్మి నష్టపోవద్దు : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రైతులు దళారులను నమ్మి నష్టపోవద్దు : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం, వెలుగు: రైతులు దళారులను నమ్మి నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సూచించారు. శుక్రవారం తెల్లాపూర్​మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెలలో వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడు  తూ రైతులు పండించిన సన్న రకం వడ్లకు ప్రభుత్వం రూ.2 వేల 320తో పాటు క్వింటాల్​కు అదనంగా రూ. 500 బోనస్​చెల్లిస్తోందన్నారు.

దళారులకు ధాన్యం విక్రయిస్తే నష్టపోతారని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్​ చైర్మన్​బుచ్చిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్​ విజయ్, సీనియర్​నాయకులు సోమిరెడ్డి, దేవేందర్​ యాదవ్​, మధు, మదన్ రెడ్డి, నాగిరెడ్డి, రాజ్​కుమార్, సాగర్,​ దయాకర్​రెడ్డి పాల్గొన్నారు.