మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు

మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు

రాయపర్తి, వెలుగు: మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్​లో శనివారం ఉచిత చేప పిల్లలను వదిలారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని చెరువుల్లో ఉచిత చేపపిల్లలను వదులుతామని చెప్పారు.

 మత్స్యకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్​ అధ్యక్షుడు జాటోతు ఆమ్యానాయక్, పార్టీ మండలాధ్యక్షుడు ఈదులకంటి రవీందర్​రెడ్డి, మత్యశాఖ జిల్లా అధికారి నాగమణి, ఎంపీడీవో కిషన్, తహసీల్దార్ శ్రీనివాస్, మైలారం ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బోయిని కుమార్ తదితరులు పాల్గొన్నారు.