
యాదాద్రి, వెలుగు : టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ను యాదాద్రి జిల్లా ఎమ్మెల్యేలు వేర్వేరుగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం గాంధీభవన్లో మహేశ్కుమార్ గౌడ్ను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి కలిసి బొకేలు అందజేశారు. వారి వెంట డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, నాయకులు తదితరులు ఉన్నారు.